వెండితెరపై మనకు వినోదం పంచుతూ, నవ్వులు కురిపిస్తూ ఉండే సెలబ్రిటీల జీవితాలలో కూడా విషాదాలు ఉంటాయి. లోపల ఎన్ని బాధలు ఉన్నా కూడా వారు పైకి నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జి ఆర్కే రోజా జీవితంలో విషాదాలు ఉంటాయని మనం ఊహిస్తామా, కాని ఆమె కెరీర్ మొదట్లో ఎన్ని ఇబ్బందులు పడిందో తాజాగా చెప్పుకొచ్చి అందరు ఎమోషనల్ అయ్యేలా చేసింది.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించిన రోజా తన నటనతో పాటు డ్యాన్స్తో ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవితో సరిసమానంగా డ్యాన్స్ చేయగలదని పేరు తెచ్చుకున్న రోజా కొన్నాళ్లకు సినిమాలు వదిలేసి ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. మరోవైపు రాజకీయాలలోను సత్తా చాటుతుంది. అయితే వినాయక చవితి సందర్భంగా ఊరిలో వినాయకుడు అనే ప్రోగ్రాం రూపొందించగా, ఇందులో తన గతం చెప్పుకొచ్చి ఏడ్పించింది.
వినాకయ చవిత స్పెషల్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, అందులో నేను 1991లో ఇండస్ట్రీకి వచ్చాను.. 2002 వరకు కష్టపడిన మొత్తం కూడా అప్పులే కట్టాను. పెళ్లి చేసుకునే ముందు నాకు సమస్యలు వచ్చాయి.. పిల్లలు పుట్టరు అని చెప్పారు. కానీ పెళ్లైన ఏడాదికి అన్షు పుట్టింది. అందుకే నాకు అన్షు అంటే చాలా ఇష్టం అంటూ రోజా కన్నీరు పెట్టేసుకున్నారు. ఇది విన్న తర్వాత రోజా జీవితంలోను అన్ని కష్టాలు ఉండేవా అని అందరు చర్చించుకుంటున్నారు.