Indian Police Force | బాలీవుడ్ పోలీస్ జానర్ చిత్రాలంటే మొదట గుర్తుకువచ్చేది బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty). ‘సింగం’, సింగం 3, సింబా, సూర్యవంశ్ వంటి కాప్(Cop) సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శెట్టి ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న మరో పోలీస్ డ్రామా ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ (Indian Police Force). బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ రూపంలో జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇదిలావుంటే.. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. భారత రాజధాని ఢిల్లీలో విధ్వంసం కలిగించే వరుస బాంబు పేలుళ్లతో ట్రైలర్ మొదలవుతుంది. అయితే ఈ పేలుళ్ల వెనక ఉంది ఎవరు అని తెలుసుకోవడానికి ఇండియన్ పోలీస్ ఫోర్స్ ముగ్గురు పవర్ ఫుల్ ఆఫీసర్స్ (సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి మరియు వివేక్ ఒబెరాయ్)లను నియమిస్తుంది. ఇక బాంబ్ బ్లాస్ట్లు చేసింది ఎవరనేది తెలుసుకోవడానికి ఈ ముగ్గురు చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరోవైపు ట్రైలర్ చూస్తుంటే.. ఇది ఇస్లామిక్ ఉగ్రవాదం చుట్టూ కేంద్రీకృతమై ఉన్న కథాంశాన్ని సూచిస్తున్నట్లు తెలుస్తుంది.
రోహిత్ శెట్టి, సుశ్వంత్ ప్రకాష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ను రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇషా తల్వార్, విభూతి ఠాకూర్, కరణ్వీర్ మల్హోత్రా, నికితిన్ ధీర్, శ్వేతా తివారీ, శరద్ కేల్కర్, ముఖేష్ రిషి, మృణాల్ కులకర్ణి, మయ్యంక్ టాండన్, వైదేహి పరశురామి, రీతూ రాజ్ సింగ్ తదితరులు ఈ సిరీస్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.