కేజీఎఫ్’ సిరీస్ రెండు చిత్రాలు సాధించిన విజయాలతో స్టార్ కథానాయకుడిగా.. మాస్తో పాటు క్లాస్, ఫ్యామిలీస్ ఇలా అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాందించుకున్నాడు కన్నడ హీరో యష్. ‘కేజీఎఫ్-2’ తరువాత తన తదుపరి చిత్రాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు యష్. కానీ యష్ తదుపరి చిత్రంపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన రాకీభాయ్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఫ్యామిలీతో కలిసి సొంత ఊరు వెళ్లిన యష్. అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన తర్వాత ప్రాజెక్ట్ గురించి చెబుతూ ‘నా తరువాత చిత్రం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందని తెలుసు. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత నాపై వుంది. ఇకపై ఆలస్యం చేయను.తొందర్లోనే నేను నటించబోయే సినిమాకు సంబంధించిన డిటైల్స్ తెలియజేస్తాను’ అన్నారు. నేను నా సొంత చిత్రంపైనే దృష్టి పెట్టాను. ఎక్కడికి వెళ్లడం లేదు అంటూ పరోక్షంగా ‘రామాయణం’లో రావణుడిగా తను నటించనున్నాడని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఖండించాడు యష్. ఆయన తన తదుపరి చిత్రాన్ని దర్శకురాలు గీతూ మోహన్దాస్తో చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. లవ్స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పలు సర్ప్రైజింగ్ విషయాలు వున్నాయని తెలిసింది.