Prabhas | తెలుగు సినీ పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్, రచయితగా తన కెరీర్ను ప్రారంభించి, దర్శకుడిగా అద్భుత విజయాలు సాధించారు. ఆయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నితిన్ లాంటి స్టార్ హీరోలు నటించగా, వారి చిత్రాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇప్పుడు ఈ ప్రముఖ దర్శకుడి కుమారుడు రుషి మనోజ్ సినీ రంగ ప్రవేశానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారన్న వార్తలు ఫిలిం నగర్లో చర్చనీయాంశంగా మారాయి.
‘అర్జున్ రెడ్డి’తో దర్శకుడిగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, తర్వాత హిందీలో ‘కబీర్ సింగ్’ మరియు ‘యానిమల్’ సినిమాలతో బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. సెప్టెంబర్ నుండి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కుమారుడు రుషి సహాయ దర్శకుడిగా చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. రుషి ఇప్పటికే నిశాచరుడు అనే షార్ట్ ఫిలిం తీసి, దానికి నటుడిగా మరియు దర్శకుడిగా పనిచేశారు. అలాగే ‘స్టాగ్నేషన్’ అనే మరో షార్ట్ ఫిల్మ్కి ఎడిటింగ్ విభాగంలో పని చేశారు. దర్శకత్వ పట్ల ఆయన ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు రవితేజ కుమారుడు కూడా స్పిరిట్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారన్న వార్తలు వచ్చినా, అవి వాస్తవం కాదని సమాచారం. ఈ సినిమాలో కొరియన్ నటుడు డాన్ లీ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ సంస్థ టి-సిరీస్తో కలిసి భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందించనుండగా, హీరోయిన్గా ‘యానిమల్’ ఫేమ్ తృప్తి దిమ్రి ఎంపికయ్యారు. కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రభాస్ సినిమాకు దర్శకుడిగా కాని, రచయితగా కాని ఇప్పటివరకు పని చేయలేదు. కానీ ఆయన కుమారుడు స్పిరిట్ చిత్రానికి పని చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.