కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దైవిక అంశాలు, అడవి బిడ్డల అస్థిత్వ పోరాటం నేపథ్యంలో పక్కా మాస్ ఎంటర్టైనర్గా అందరిని మెప్పించింది. ఈ సినిమాతో చిత్ర హీరో, దర్శకుడు రిషబ్శెట్టి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమా కథ, కథనాలు ఒక ఎత్తయితే..అన్నింటికి మించి ైక్లెమాక్స్ హైలైట్గా నిలిచింది.
కథానాయకుడిని పంజుర్లీ దేవత ఆవహించే సన్నివేశాలు రొమాంచితంగా సాగాయి. ‘కాంతార’ ైక్లెమాక్స్ ఘట్టాల చిత్రీకరణపై రిషబ్శెట్టి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. తనకు తప్ప సినిమా యూనిట్లో ఎవరికీ ైక్లెమాక్స్ ఎలా ఉంటుందనే ఐడియా లేదన్నారు. ఆయన మాట్లాడుతూ ‘దక్షిణ కన్నడలో సాంస్కృతిక ప్రాచుర్యం పొందిన భూత్కోలా ఆచారాన్ని, పంజుర్లీ దేవతను నేను బలంగా విశ్వసిస్తాను. చిన్నప్పటి నుంచి నేను చూసిన అనుభవాలతో ైక్లెమాక్స్ రాసిపెట్టుకున్నా. ప్రతి రోజు చిత్రీకరణకు ముందు పంజుర్లీ దేవతకు పూజలు చేసేవాడిని.
ైక్లెమాక్స్లో ఎలాంటి సీన్స్ ఉంటాయనే విషయాన్ని షూట్కు ముందు కెమెరామెన్కు మాత్రమే చెప్పేవాడిని. షూటింగ్ పూర్తయ్యేవరకు ైక్లెమాక్స్ గురించి ఎవరూ అంచనా వేయలేకపోయారు’ అని చెప్పారు.