పదాలతో అద్భుతాలు సృష్టించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు అనే విషయం ప్రతి ఒక్కరికి భారంగానే ఉంది. 66 ఏళ్ళ వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం (నవంబర్ 30) సాయంత్రం 4:07 గంటలకు ఈ లెజండరీ రచయిత కన్నుమూసారు. ఆయన మృతిని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు ఆయనతో జ్ఞాపకాలు షేర్ చేసుకుంటున్నారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియాలో ఓ ఆడియో పోస్ట్ పెట్టారు. “సీతారామశాస్ట్రి గారితో నా ఫస్ట్ మెమొరీ… అన్నపూర్ణ స్టూడియోలో ఓ చెట్టుకింద కూర్చుని ఒక సిట్యుయేషన్ చెప్పి కాలేజ్ సాంగ్ లో కవిత్వం ఉండొద్దు అండి. మాములు స్టూడెంట్స్ మాట్లాడే మాటలు చాలు.. ఆ మాటలో నుంచి పాట వచ్చినట్టుగా ఉండాలి అని చెప్పగా… రెండు మూడు సెకండ్లలోనే ‘బాటనీ పాఠముంది’ సాంగ్ రాశారు. గాయం సినిమాలో సాంగ్ కూడా అద్భుతంగా రాసారు. ఇలా తలచుకుంటూ పోతే ఆయనతో ఎన్నెన్నో మెమొరీలు.
ఇప్పుడు జరిగిన ఘటన ప్రతి ఒక్కరికీ షాకింగ్… కానీ నాకు తెలిసి ఓ ఫిలాసఫర్ చెప్పిన దాని ప్రకారం… అందరూ జీవిస్తారు. కానీ కొంతమంది మాత్రం ముందుముందు తరాలకు ఒక మార్గదర్శిగా, ఇన్స్పిరేషన్ గా మిగిలిపోతారు. ఒకవైపు నుంచి ఆయన పోయినందుకు ఇంతా బాధగా ఉన్నా… ఆయన లైఫ్ టైంలో చేసినవన్నీ తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకూ ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఆయన పాటలను తలచుకుంటారు. ఆయన భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన సినిమాల్లో ఆయన చేసిన కృషి కారణంగా ఎప్పటికీ మన మధ్య బ్రతికే ఉంటారనే విషయం మాత్రం నాకు ఆనందం కలిగిస్తోంది” అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడారు రామ్ గోపాల్ వర్మ.
https://www.instagram.com/tv/CW501vzgeBE/?utm_source=ig_web_copy_link