మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం రిపబ్లిక్. కరోనా వలన వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్నిఅక్టోబర్ 1న థియేటర్స్లో విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు.కాని అంతలోనే సాయి తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది.
అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఆయన నటించిన రిపబ్లిక్ చిత్రం వాయిదా పడుతుందని అంతా ఊహించారు. కాని రిపబ్లిక్ ని నిర్మాతలు అనుకున్నట్లుగానే అక్టోబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. జీటీవీ సంస్థ సినిమా హక్కులన్ని చేజిక్కించుకుంది. మార్కెట్ సహా అన్ని రకాల రైట్స్ అదే సంస్థకు నిర్మాతలు కట్టబెట్టారు. కాబట్టి రిలీజ్ విషయంలో వెనుకడుగు వేసేది లేదని సదరు సంస్థ ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ తప్ప మిగతా చిత్ర బృందం అంతా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.ఇప్పుడు చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తే రానున్న రోజులలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందేమోనని భావిస్తున్న నిర్మాతలు అక్టోబర్ 1న రిపబ్లిక్ చిత్రాన్ని తప్పనిసరిగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భగవాన్ పుల్లారావు నిర్మించిన సంగతి తెలిసిందే.