నజ్రాన్ : సౌదీ అరేబీయాలోని నజ్రాన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును మరో వాహనం ఢీకొట్టడంతో కేరళకు చెందిన ఇద్దరు నర్సులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. మృతులను తిరువనంతపురానికి చెందిన విజయన్ (31), కొట్టాయం ప్రాంతానికి చెందిన షిన్సీ ఫిలిప్ (28)గా అక్కడి పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో డ్రైవర్ సహా మరో ఇద్దరు నర్సులకు తీవ్రగాయాలయ్యాయి. మృతులు, క్షతగాత్రులంతా సౌదీలోని కింగ్ ఖలీద్ దవాఖానలో నర్సులుగా పని చేస్తున్నట్లు తెలిసింది. గాయపడిన ఇద్దరు నర్సులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.