‘చరిత్రలో మరుగున పడిన ఓ రాణి కథను గురించి అధ్యయనం చేసేందుకు యువ ఆర్కియాలజిస్ట్ సిద్ధమవుతుంది. ఆ అన్వేషణలో ఆమె తెలుసుకున్న నిజాలేమిటి? ఆర్కియాలజిస్ట్ రూపంతోనే ఆ రాణి ఎందుకున్నదనేది తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటోంది రెజీనా. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘నేనే నా’. కార్తిక్రాజు దర్శకుడు. రాజశేఖర్వర్మ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ ‘మిస్టరీ థ్రిల్లర్ కథాంశమిది. ఆర్కియాలజిస్ట్గా రెజీనా పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. ఊహకందని మలుపులతో ఉత్కంఠను పంచుతుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలో టీజర్ను విడుదలచేస్తాం’ అని తెలిపారు. వెన్నెల కిషోర్, అక్షరగౌడ, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్, ఛాయాగ్రహణం: గోకుల్.