1995లో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిదని అన్నారు విశ్వజగత్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ధర్మపురి’. గగన్ విహారి, అపర్ణదేవి జంటగా నటిస్తున్నారు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘సహజత్వానికి ప్రాముఖ్యతనిస్తూ తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రమిది. ఊరి గడీలో పనిచేసే జీతగాడికి, బీడీలు చుట్టుకునే అమ్మాయికి మొదలైన ప్రేమాయణం ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఒరిజినల్ లొకేషన్స్లో ఈ సినిమాను తెరకెక్కించాం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఓషో వెంకట్.