Manjummel Boys | ఈ ఏడాది సక్సెస్ఫుల్ సినీ ఇండస్ట్రీ ఏది అంటే వెంటనే గుర్తోచ్చేది మలయాళ ఇండస్ట్రీ. గత రెండు నెలల నుంచి మలయాళ సినీ పరిశ్రమ హ్యాట్రిక్ బ్లాక్బాస్టర్లతో కళకళలాడుతోంది. ‘ప్రేమలు’, ‘భ్రమయుగం’ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన మాలీవుడ్ రీసెంట్గా ‘మంజుమ్మెల్ బాయ్స్'(Manjummel Boys)తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ను అందుకుంది. సర్వైవర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై ఒక్క మలయాళంలోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే సినిమాను తెలుగులో ఏప్రిల్ 05న విడుదల చేయగా ఇక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఈ చిత్రం మే 03 నుంచి మలయాళం, తెలుగు, తమిళం హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. చిదంబర్ పీ పొదువల్(Chidambaram S Poduval) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభున్ షాహిర్ తో పాటు, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్ ఇంకా అభిరాం ప్రధాన పాత్రల్లో నటించారు.
Malayalam Cinema’s Biggest BLOCKBUSTER Movie #ManjummelBoys Digital Premiere From May 3 On Disney+Hotstar… pic.twitter.com/a2vNNPAHd1
— The South Movies (@TheSouthMovies1) April 19, 2024
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2006లో తమిళనాడు కొడైకెనాల్లోని గుణ గుహలలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ గుణ గుహలను సందర్శించడానికి వెళ్లగా ఆ గ్యాంగ్లో ఒకరు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోతాడు. అయితే అతడిని కాపాడేందుకు అతని స్నేహితులు చేసిన రెస్క్యూ ఈ సినిమా స్టోరీ. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సినిమా రావడంతో ప్రేక్షకులు కాసులు వర్షం కురిపిస్తున్నారు.