‘ప్రజలకు నిజాలు చెప్పడానికే ‘రజాకార్’ సినిమా చేశాం.’ అంటున్నారు దర్శకుడు యాటా సత్యనారాయణ. ఆయన దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్పాండే ప్రధానపాత్రధారులు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. యాటా సత్యనారాయణ మాట్లాడుతూ “రజాకార్లు పాల్పడిన దురాగతాలను తెరపై కళ్లకు కట్టినట్టు చూపించాం.
1947 ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగిన సంఘటనలు ఇందులో చూపించాం. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా ఇందులో కనిపిస్తాయి. అలాగే ఆంధ్ర ప్రాంతానికి కూడా ఈ కథతో సంబంధం వుంది’ అని తెలిపారు. ఈ సినిమా చేయడానికి ఎంతో రీసెర్చ్ చేశానని, వందల పుస్తకాలు చదివానని, ఈ చరిత్రతో దాదాపు 15 సినిమాలు తీయొచ్చని, అందరి సహకారం వల్లే ఇంత గొప్ప సినిమాను ఇంత బాగా తీయగలిగానని ఆయన అన్నారు.