తెలుగు చిత్రసీమలో మరో సరికొత్త కలయికకు రంగం సిద్ధమైంది. రవితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘రవితేజ హీరోగా నటిస్తున్న 69వ చిత్రమిది. ఆయన నుంచి అభిమానులు కోరుకునే హంగులన్నీ ఉంటాయి. ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. కథ, కథనాలు విభిన్నంగా ఉంటాయి. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు.