Ravi Teja 100 crore Deal | క్రాక్ తర్వాత రూటు మార్చాడనుకుంటే మళ్లీ పాత చింతకాయ పచ్చడి టైప్ కథలే ఎంచుకుంటున్నాడు మాస్రాజా రవితేజ. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కథ, కథనం పరంగా పరమ బోరింగ్ సినిమాలు. కాస్తో కూస్తో జనాలను ఎంటర్టైన్ చేసిందంటే ధమాకా సినిమానే. ఈ సినిమా కూడా ఆహా ఓహో అనిపించే రేంజ్లో లేకపోయినా.. వాటితో పోలిస్తే కాస్త బెటర్గానే ఉంటుంది. దానికి తోడు శ్రీలీల డ్యాన్స్లు, పరువాల విందుకు కలెక్షన్లు సైతం కాళ్లు కదిపాయి. ఇక ఈ ఏడాది వచ్చిన రావణాసుర కథ పరంగా ఒకే అనిపించిన కథనం బోరింగ్గా ఉండటంతో పాస్ మార్కులు వేయించుకోకుండానే దుకాణం సర్దేసింది.
ప్రస్తుతం రవన్న మూడు సినిమాలను లైనప్లో పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మాస్ రాజా ఓ భారీ డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ ట్రాక్లో దూసుకుపోతున్న పీపుల్ మీడియా నిర్మాణ సంస్థతో వంద కోట్ల డీల్ ఓకే అయినట్లు సమాచారం. ఇటీవలే పీపుల్ మీడియా సంస్థ.. రవితేజతో నాలుగు సినిమాల ఒప్పందం కుదుర్చుకుందని, దాని కోసం రవితేజకు వంద కోట్ల పెద్ద మొత్తం ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ఈగల్ సినిమాను నిర్మిస్తుంది ఈ సంస్థే. దీని తర్వాత కలర్ ఫోటో సందీప్ రాజ్తో ఓ సినిమా తెరకెక్కబోతుంది. అదే విధంగా ఇద్దరు కొత్త దర్శకులతో మరో రెండు సినిమాలు ఈ సంస్థ ప్లాన్ చేసినట్లు టాక్.
ప్రస్తుతం రవితేజ ఒక్కో సినిమాకు పాతిక కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే వంద కోట్ల డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. రవితేజ కెరీర్లో ఇంత పెద్ద మొత్తంలో డీలింగ్ జరగడం ఇదే తొలిసారి. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ దీనికి సంబంధించిన చర్చ మాత్రం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. ప్రస్తుతం రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు రిలీజ్కు సిద్ధంగా ఉంది. వంశీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.