నాగ్ ఇంటిసభ్యులతో ‘నేను ఎవరిని?’ గేమ్ ఆడించారు. ఇందులోని చీటీలలో కంటెస్టెంట్ల పేర్లు రాసి ఉన్నాయి. టీమ్ నుంచి ఒక్కొక్కరు వస్తూ తము తీసుకున్న చీటీలో ఎవరి పేరైతే ఉంటుందో వారిని ఇమిటేట్ చేయాలి. సదరు టీమ్ వాళ్లు గెస్ చేయాలి. ఈ గేమ్లో ముందుగా సన్నీ వచ్చాడు. అతడికి సిరి పేరు రాగా, అచ్చం సిరిలా ఇమిటేట్ చేయడంతో విశ్వ వెంటనే గెస్ చేశాడు.
ఇక రవికి కాజల్ పేరు రాగా, ఆమె ఇంత చెండాలంగా తింటుందా అనేలా చేసి చూపించాడు. ఆమెలా రవి చేస్తుండగా, మానస్..కాజల్ అని చెప్పాడు. ఆ తరువాత విశ్వకి మానస్ పేరు వచ్చింది. మానస్ ఎలా స్టైల్గా నిలబడతాడు. నడుస్తాడో చూపించాడు. వెంటనే గెస్ చేశారు. ఇక శ్రీరామచంద్ర వచ్చాడు.. అతనికి సన్నీ పేరు వచ్చింది. సన్నీ హడావిడిని చేసి చూపించారు. వెంటనే సన్నీ అని అందరు చెప్పారు.
కాజల్కి రవి పేరు రాగా, అతడి మేనరిజంని ఇమిటేట్ చేసింది. వెంటనే చెప్పేశారు. ఇక సిరికి ఆనీ మాస్టర్ పేరు వచ్చింది. ఆనీ మాస్టర్లా డ్యాన్స్ చేసింది. కానీ జెస్సీ అంటూ మానస్ తప్పుగా చెప్పాడు. దీంతో ఓ పాయింట్ కోల్పోయింది. షణ్ముఖ్కి విశ్వ పేరు రాగా, అతడు జిమ్ చేస్తున్నట్టు నటించాడు. దీంతో అందరు విశ్వ అని చెప్పారు. అక ఆనీ మాస్టర్ వచ్చి షన్నులా పోజు పెట్టేసింది. అందరూ కనిపెట్టేశారు.
ప్రియాంక వచ్చి.. శ్రీరామచంద్రలా ఇమిటేట్ చేసింది. ఈజీగానే గెస్ చేశారు. మానస్ .. జస్వంత్లా ఇమిటేట్ చేశాడు. ఈజీగా గెస్ చేశారు. అలా మొత్తానికి ఈ ఆటలో సన్నీ టీం గెలిచింది. ఇక చివరకు వరెస్ట్ పర్ఫార్మర్ ఎవరో అని చెప్పమన్నాడు. ఎక్కువ మంది కాజల్ పేరును చెప్పేశారు. అలా మొత్తానికి కాజల్ వరస్ట్ పర్ఫార్మ్గా ఎంపికైంది. దీంతో ఆమె బిగ్ బాస్ చెప్పే వరకు జైల్ లోనే ఉండనుంది.