రవిబాబు మాంత్రికుడు పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘టెర్రర్ ద వే ఆఫ్ డెవిల్’. రవీంద్రనాథ్ ఎం.ఎస్ దర్శకుడు. సీవీఎస్ఎమ్ వెంకట్ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది.
దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామాలలో మాతంగులుగా జీవిస్తున్న వారి జీవితాల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ద్వారా ముగ్గురు హీరోయిన్లు పరిచయం కాబోతున్నారు’ అన్నారు. సత్య ప్రకాష్, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: రాజ్కమల్.