25 సంవత్సరాల క్రితం శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో.. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ప్రధానంగా తెరకెక్కి చి్త్రం పెళ్లి సందడి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ తరం ‘పెళ్లి సందD’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ,ఈ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో.. గౌర రోనంకి డైరక్షన్ చేశారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, కన్నడ నటి శ్రీలీలా ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు.
అక్టోబర్ 15న పెళ్లి సందడి ప్రీ రిలీజ్ ఈవెంట్గా జరగగా, ఈ కార్యక్రమానికి చిరంజీవి, వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అప్పటి పెళ్లి సందడి హీరోయిన్ రవళి కూడా హాజరైంది. అయితే స్టేజ్పై మాట్లాడుతున్న సమయంలో తాను రవళి అనే చెప్పే వరకు ఆమె రవళి అని ఎవరు గుర్తించలేకపోయారు. తాను రవళిని అంటూ చిరంజీవికి చెప్పే సరికి ఆయన షాక్ అయ్యారు.
నన్ను ఈ మధ్య ఎవరు గుర్తు పట్టని కారణంగా ఈవెంట్స్కి రావడం లేదని తెలిపింది. రాఘవేంద్రరావు పిలిస్తే రాలేకుండా ఉండలేకపయానని స్పష్టం చేసింది రవళి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో అల్లు అరవింద్, అశ్విని దత్, శ్రీకాంత్, గౌరీ రోణంకి, శ్రీలీల, కీరవాణి, చంద్రబోస్, దీప్తి భట్నాగర్, రవళి, బి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.