Rashmika Mandanna | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కంటెంట్ను సృష్టిస్తూ టెక్నాలజీని దుర్వినియోగం చేయడాన్ని సినీ నటి రష్మికా మందన్నా తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను ఆమె నైతిక పతనం(moral decline)గా అభివర్ణించారు. ఈ సందర్భంగా రష్మికా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
AI సాంకేతికతపై రష్మిక తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ‘నిజాన్ని కూడా సృష్టించగలిగినప్పుడు, వివేచన (Discernment) మనకు గొప్ప రక్షణ అవుతుంది. AI అనేది అభివృద్ధికి ఒక శక్తి. కానీ మహిళలను లక్ష్యంగా చేసుకుని, అసభ్యతను సృష్టించడానికి దానిని దుర్వినియోగం చేయడం, కొంతమంది వ్యక్తులలో ఉన్న లోతైన నైతిక పతనాన్ని సూచిస్తుంది. గుర్తుంచుకోండి, ఇంటర్నెట్ ఇకపై నిజానికి అద్దం కాదు. అది దేన్నైనా సృష్టించగలిగే ఒక కాన్వాస్. మనం ఈ దుర్వినియోగానికి అతీతంగా ఎదగాలి, మరింత గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి AIని ఉపయోగించాలి. నిర్లక్ష్యంగా ఉండడం కంటే బాధ్యతగా ఉండడం తెలుసుకోండి. ప్రజలు మనుషుల్లా ప్రవర్తించకపోతే, వారికి కఠినమైన మరియు క్షమించరాని శిక్ష విధించాలి’. అంటూ రష్మిక రాసుకోచ్చింది. AI డీప్ఫేక్ల వల్ల ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు బాధితులుగా మారిన నేపథ్యంలో రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
“When truth can be manufactured, discernment becomes our greatest defence.”
AI is a force for progress, but its misuse to create vulgarity and target women signals a deep moral decline in certain people.
Remember, the internet is no longer a mirror of truth. It is a canvas where…— Rashmika Mandanna (@iamRashmika) December 3, 2025