Rashmika Mandanna | సినీ రంగంలో తారలు వెలుగులోకి రావడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో రష్మిక మందన్న ఒకరు. ‘కిర్రాక్ పార్టీ’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ విజయం సాధించింది. కన్నడలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్తోనే తెలుగులో ‘ఛలో’ మూవీలో ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు రష్మిక సైన్ చేసిన ప్రతీ సినిమా బ్లాక్బస్టర్ విజయాలు సాధించాయి. 2021లో రిలీజైన పుష్పతో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఈ బ్యూటీకి తెలుగు, కన్నడలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడుతున్న.. వేరే భాషల్లో మాత్రం విజయాలు వరించడం లేదు. హిందీలో మూడు సినిమాలలో నటిస్తే అందులో రెండు డిజాస్టర్లే. ఇక మూడో సినిమా నేరుగా ఓటీటీలోనే రానుంది. హిందీ భాష అటుంచితే.. తమిళంలోనూ ఇదే పరిస్థితి. కార్తితో చేసిన ‘సుల్తాన్’ కనీసం బడ్జెట్లో సగం కలెక్షన్లు కూడా రికవరీ చేయలేకపోయింది. ఆ తర్వాత తమిళం నుండి అసలు అవకాశాలే లేవు. అయితే తాజాగా ఈ అమ్మడు ‘వారిసు’ సినిమాతో తమిళంలో తన అదృష్టాన్ని రెండో సారి పరిక్షించుకోవడానికి సిద్ధమైంది.
కాగా ఈ సారి రష్మిక డిస్టింక్షన్లో పాస్ అయిపోయింది. బుధవారం రిలీజైన ‘వారిసు’ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. తెలుగులో ఈ మూవీ శనివారం రిలీజ్ కానుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రిలీజైన పాటలు, ట్రైలర్లు తెలుగులో ఏ మాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. పైగా వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి నాన్ వెజ్ సినిమాలతో పోటీ పడుతుంది. కాగా దిల్రాజు నిర్మాత కావడంతో కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చిన బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.