Rashmi Gautam | జబర్దస్త్ యాంకర్గా తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రష్మి గౌతమ్ ప్రస్తుతం ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలకు యాంకర్గా కొనసాగుతోంది. జబర్దస్త్ షో రష్మికి ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అయితే ఈ పాపులారిటీకి మరో ప్రధాన కారణం సుడిగాలి సుధీర్తో ఆమె నడిపిన లవ్ ట్రాక్. జబర్దస్త్లో సుధీర్, రష్మి కలిసి చేసిన లవ్ స్కిట్లు, డ్యూయెట్ స్కిట్లు ఆడియెన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అభిమానులు కూడా అదే నిజమని భావించారు.
కానీ అనూహ్యంగా గత రెండేళ్లుగా ఈ జంట దూరమైంది. సుధీర్ జబర్దస్త్ షోను వదిలేయడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత మళ్లీ కలిసి కనిపించడం చాలా అరుదుగా మారింది. అయినప్పటికీ కొన్నిసార్లు మాత్రమే వీరు కలుసుకుంటూ తమ స్నేహాన్ని చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా, నలభై ఏళ్లకు దగ్గరగా ఉన్నా రష్మి గౌతమ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఎప్పటినుంచో చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లేటెస్ట్ ఎపిసోడ్లో పాల్గొన్న ఓ ఆస్ట్రాలజర్ రష్మి జాతకం చెప్పాడు. వచ్చే ఏడాది ఆగస్ట్లో రష్మి పెళ్లి జరుగుతుందని, ఆమె జీవితంలో పెళ్లి యోగం ఖచ్చితంగా ఉందని వెల్లడించాడు. అంతేకాదు, ఆమె మనసులో ఉన్న వ్యక్తితోనే వివాహం జరుగుతుందని చెప్పడంతో ఆసక్తి మరింత పెరిగింది.
ఈ వ్యాఖ్యలపై రష్మి కూడా స్పందించింది. ఆస్ట్రాలజర్ చెప్పిన విషయాల్లో చాలా వరకు నిజం ఉందని ఆమె అంగీకరించింది. దీంతో రష్మి పెళ్లి వచ్చే ఏడాది ఆగస్ట్లోనే ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఇక ఆమె మనసులో ఉన్న వ్యక్తి ఎవరు? అది సుడిగాలి సుధీరేనా? లేక మరెవరైనా ఉన్నారా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్కు సంబంధించిన క్లిప్స్ వైరల్గా మారగా, రష్మి పెళ్లిపై అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.