Prashanth Varma – Ranveer Singh | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘జై హనుమాన్’ (Jai Hanuman). గతేడాది ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం దీనికి సీక్వెల్ ‘జై హనుమాన్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అయితే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్ను ఖరారు చేశారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, అన్ని భాషల్లో అదే టైటిల్ ఉంటుందని అంటున్నారు. ‘హనుమాన్’ సినిమా తరహాలోనే సూపర్హీరో కథాంశంతో ‘బ్రహ్మరాక్షస’ తెరకెక్కనుందని, భారీ సాంకేతిక హంగులతో ఈ సినిమాను తీయబోతున్నారని హనుమాన్ జయంతికి పూజా కార్యక్రమాలతో లాంఛ్ కూడా అయిందని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు సడెన్గా ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు రావడం మళ్లీ మొదలయ్యాయి. హీరో దర్శకుడు మధ్య క్రియేటివ్ డిఫెరెన్సెస్ వచ్చాయని, దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారని అంతా అన్నారు.
అయితే ఈ వార్తలపై తాజాగా ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. హనుమాన్ జయంతి రోజున ఈ మూవీ షూటింగ్ను హైదరాబాద్లో మొదలుపెట్టినట్లు ప్రకటించింది. ఇప్పటికే మూవీకి సంబంధించి రణవీర్ సింగ్ పై కొన్ని సీన్లు కూడా షూట్ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై వస్తున్న వార్తలపై చెక్ పెట్టినట్లయింది.
మరోవైపు ‘హనుమాన్’కు సీక్వెల్గా వస్తున్న ‘జై హనుమాన్ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధమయిపోయిందని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.