వినయ విధేయ రామ చిత్రం తర్వాత రామ్ చరణ్.. ఆచార్య అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమతో పాటుగా ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చేశాడు.ఇటీవల ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం గత కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు.
సెప్టెంబర్ 8న ఈ మూవీ ప్రారంభోత్సవం జరగనుండగా, ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ను దించబోతున్నట్టుగా తెలుస్తుంది. శంకర్.. రణ్వీర్తో కలిసి బాలీవుడ్ అపరిచితుడు చేయనుండా, ఆ క్రమంలోనే చరణ్ మూవీ ప్రారంభోత్సవానికి రణ్వీర్ని ఆహ్వానించినట్టు సమచారం. మరికొద్ది రోజులలో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.
ప్రస్తుతం సినిమా కోసం సెట్స్ నిర్మాణం చేస్తున్నారు. శంకర్ మార్క్ సెట్టింగ్ లు మేకింగ్ ను ఈ సినిమాలో చూడబోతున్నాం. ఈ సినిమా లో మంచి మెసేజ్ తో పాటు ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబోలో రూపొందుతున్న సినిమా భారీ పాన్ ఇండియా మూవీగా ఉంటుందని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న 50వ సినిమా అవ్వడం వల్ల చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు.