Ranadaggupati | దగ్గుపాటి రానా, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 1945. బ్రిటీష్ పాలన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సత్యశివ దర్శకత్వం వహించాడు. కే ప్రోడక్షన్స్ బ్యానర్పై ఎస్ఎన్ రాజరాజన్ నిర్మించిన ఈ చిత్రాన్ని క్లైమాక్స్ లేకుండానే థియేటర్లో విడుదలచేశారు. ఈ చిత్రం 90శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈచిత్ర దర్శకుడితో రానాకు విభేదాలు వచ్చాయిని..రానా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. దాంతో సినిమా ఆగిపోయిందని సమాచారం.అయినా కాని చిత్రబృందం థియేటర్లో విడుదల చేశారు. జనవరి 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫిస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఈ చిత్రం అస్సలు సినిమా వచ్చిందనే విషయమే చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఈ చిత్రానికి నాకు ఏ సంబంధంలేదు అని రానా సినిమా విడుదలకు ముందే వెల్లడించాడు. ఈ చిత్రానికి రానా డబ్బింగ్ కూడా చెప్పలేదూ అంటే ఏ పరిస్థితుల్లో ఈ సినిమాను విడుదలచేశారో తెలుస్తుంది. ఇక ఈ చిత్రం వచ్చే ఆదివారం( ఫిబ్రవరి 6)న జెమినీ టీవిలో ప్రసారంకానుంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి7న సన్నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.ఒక రోజు గ్యాప్లో అటు టీవీలో ఇటు ఓటీటీలో ప్రసారంకావడం విశేషం అనే చెప్పాలి.