దగ్గుబాటి వారసుడు రానా నటుడిగానే కాకుండా నిర్మాతగాను సత్తా చాటుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తండ్రితో పాటు నిర్మాణ రంగంలోనూ యాక్టివ్గా మారారు. ఆయన వెండితెరపైనే కాదు బుల్లితెరపై సందడి చేస్తున్నాడు.అయితే కేవలం హీరోయిజం ప్రదర్శిస్తాను అని గిరి గీసుకొని కూర్చోకుండా నెగెటివ్ షేడ్లోను నటిస్తూ మెప్పిస్తున్నాడు.
బాహుబలి చిత్రంలో భళ్లాలదేవుడిగాఅద్భుత పర్ఫార్మెన్స్ కనబరచిన రానా ఇప్పుడు పవర్స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు.ఈ సినిమా కోసం రానా భారీ పారితోషికం అందుకుంటున్నాడట. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని పవన్ – రానా కాంబినేషన్లో ‘భీమ్లా నాయక్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
భీమ్లా నాయక్ చిత్రం పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో రానా నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాకి 25 రోజుల కాల్షీట్స్ ఇచ్చిన రానా అందుకుగాను అక్షరాలా 4 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. ఇది విని అందరు అవాక్కవుతున్నారు. రానా క్రేజ్ పెరిగిన నేపథ్యంలో ఆ మొత్తం అందుకోవడంలో తప్పు లేదంటున్నారు అభిమానులు.