Rana Daggubati | అహింస ప్రమోషన్స్ టైంలో డైరెక్టర్ తేజ బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati)తో మరో సినిమా చేస్తానంటూ హింట్ ఇచ్చాడని తెలిసిందే. 2017లో రానా-తేజ కాంబోలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మంచి బ్రేక్ అందించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పనులు షురూ అయ్యాయని వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం తేజ (Teja) ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ను సంప్రదించాడట.
సంతోష్ నారాయణన్ ప్రస్తుతం వెంకటేశ్ టైటిల్ రోల్లో నటిస్తున్న సైంధవ్ సినిమాకు పనిచేస్తున్నాడని తెలిసిందే. ప్రమోషన్స్లో బిజీగా ఉంది వెంకీ టీం. మరి తేజ-రానా సినిమాపై వస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ చిత్రానికి గోపీచంద్ ఆచంట నిర్మాతగా వ్యవహరించనున్నాడని వార్తలు వస్తుండగా.. రాబోయే రోజుల్లో తేజ కాంపౌండ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ ఏడాది నిఖిల్ నటించిన స్పైలో అతిథి పాత్రలో మెరిశాడు రానా. ఈ యాక్టర్ నుంచి మరోవైపు రానానాయుడు వెబ్ ప్రాజెక్టు సెకండ్ ఇన్స్టాల్ మెంట్ అప్డేట్ కూడా రావాల్సి ఉంది.