రానా కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో రూపొందిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో ‘రాక్షస రాజు’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు సీక్వెల్ ఇదని సోషల్మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఇది పూర్తి భిన్నమైన కథాంశమని 1960 నేపథ్యంలో పీరియాడిక్ మూవీగా తెరకెక్కించబోతున్నారని తెలిసింది. ఇందులో రానా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని, ఆయన సరికొత్త అవతారంలో కనిపిస్తారని చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్మీదకు వెళ్లనుంది.