Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వస్తున్న ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు మళ్లీ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్జీవీ ఎక్స్ వేదికగా ప్రకటించాడు.
రాంగోపాల్ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాలకు మొదట సెన్సార్ (Censor Board) అడ్డంకులు ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు (High Court) సూచనల మేరకు రెండోసారి సెన్సార్ సర్టిఫికేటును జారీ చేయడంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో మొదటి పార్ట్ ‘వ్యూహం’ సినిమాను ఈ నెల 23న రెండో పార్ట్ ‘శపథం’ ను మార్చి 01న విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమాలు పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ వేదికగా తెలుపుతూ.. ‘వ్యూహం’ సినిమా మార్చి 1న.. ‘శపథం’ మార్చి 8న విడుదల కానున్నాయి. అయితే ఈసారి పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం లోకేష్ కాదు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల.. పోస్టపోన్ అయ్యింది అంటూ ఆర్జీవీ రాసుకోచ్చాడు.
— Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2024