టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోల్లో బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్న వారికి కొదవేమీ లేదు. ఈ జాబితాలో మహేశ్ బాబు టాప్ లో ఉండగా..ఆ తర్వాత అల్లు అర్జున్ వస్తాడు. వీరితోపాటు మరో స్టార్ హీరో రాంచరణ్ కూడా ఈ లిస్టులో ఉంటాడు. రాంచరణ్ (Ram Charan)ఇప్పటికే డిస్నీప్లస్+హాట్స్టార్ కమర్షియల్ యాడ్ అండ్ యాడ్ క్యాంపెయిన్లో మెరిశాడు.
తాజాగా రాంచరణ్ మరో కొత్త బ్రాండ్కు సంతకం చేశాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. తాజా అప్డేట్ ప్రకారం పాపులర్ బైక్ మ్యానుఫ్యాక్చరర్ (bike manufacturer company) కంపెనీ బ్రాండ్ ప్రమోషన్కు సైన్ చేశాడట. ఈ యాడ్ షూట్ కోసం ఇప్పటికే హైదరాబాద్లోని ప్రైవేట్ స్టూడియోలో కనిపించాడు. రాంచరణ్ ప్రమోట్ చేస్తున్న తాజా యాడ్ త్వరలోనే స్క్రీన్పై సందడి చేయనుంది.
రాంచరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15 (RC15)లో నటిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నవీన్ చంద్ర, అంజలి, సునీల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.