Ram Charan | ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు నటుడు రామ్చరణ్. ఈ సినిమా ఇటీవల జపాన్లో కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జపాన్ వెళ్లిన చరణ్, ఉపాసన దంపతులు అక్కడ సందడి చేశారు. అనంతరం ఈ జంట అట్నుంచి అటు ఆఫ్రికా వెళ్లారు. అక్కడ పలు ప్రాంతాలను చుట్టేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు.
తాజాగా, ఆఫ్రికా ట్రిప్కు సంబంధించిన ఓ వీడియోను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ జంట వెకేషన్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. చరణ్, ఉపాసన దంపతులు నేలపై సేద తీరుతూ.. అక్కడి నేచర్ను ఎంజాయ్ చేశారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు.
ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్… శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీ నటిస్తోంది. కీలకపాత్రలో మరో హీరోయిన్ అంజలి కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ సినిమాని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.