రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఇదే టైటిల్ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 27న రామ్చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ ప్రకటన, టీజర్ రిలీజ్ ఉంటాయని సమాచారం. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీత్నాందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. ‘గేమ్ ఛేంజర్’కు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో రామ్చరణ్ అభిమానులు ఈ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాల్ని పెట్టుకున్నారు.