ఐదారేండ్లు తెలుగు తెరపై వెలిగిన అందాల తార రకుల్ప్రీత్ సింగ్ క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. లాక్డౌన్లో రిలీజైన ‘కొండపొలం’ సినిమా తర్వాత ఆమె తెలుగు చిత్రమేదీ అంగీకరించలేదు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ అపజయంతో అప్పటికే స్లంప్లో ఉన్న రకుల్ కెరీర్కు పుల్స్టాప్ పడింది. పరిస్థితి గమనించిన ఈ నాయిక పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి సారించింది.
అడపాదడపా తమిళ చిత్రాల్లోనూ నటిస్తున్నది. ఈ నేపథ్యంలో రకుల్ మాట్లాడుతూ…‘వరుసగా హిందీలో నటిస్తుండటం వల్లే తెలుగు, తమిళ చిత్రాల్లో నటించలేకపోతున్నా. నేను ముంబైలో ఉండటం కూడా దీనికి మరో కారణం. తమిళంలో కమల్హాసన్తో ‘ఇండియన్ 2’, దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నా. తెలుగులోనే సరైన అవకాశం రావడం లేదు. టాలీవుడ్లో నా అభిమానులను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ కలుగుతున్నది. వీలు దొరికితే తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించాలని ఉంది’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ తార హిందీలో ‘ఛత్రివాలి’, ‘మేరీ పత్నీ కా రీమేక్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నది.