తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ తన కెరీర్లో రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్తో పాటు ప్రధాన పాత్రధారుల లుక్స్ రివీల్ చేశారు. అక్టోబర్ 8న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు కూడా తెలియజేశారు. సినిమాలో వైష్ణవ్, రకుల్ పాత్రలు కాస్త భిన్నంగా ఉంటాయని తెలుస్తుండగా, రకుల్ ఒక గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
ఓబులమ్మ అనే పాత్రలో కనిపించనున్న రకుల్ వాస్తవికత కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసుకుంది. ముఖ్యంగా గొర్రెల కాపరిగా ఉండేందుకు చాలా కష్టపడ్డట్టు పేర్కొంది. ప్రత్యేకమైన బ్లీటింగ్ శబ్దాలను నేర్చుకోవడమే కాకుండా, ఆ గొర్రెలను నియంత్రణలోకి తీసుకోవడానికి ఎంతో కష్టపడినట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఏకంగా సెట్ లో వెయ్యి గొర్రెలతో షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలిపింది. మరోవైపు వైష్ణవ్ తేజ్ కూడా తన పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచినట్టు తెలుస్తుంది.కటారు రవీంద్ర యాదవ్ పాత్రలో వైషు కనిపించనున్నాడు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించారు.