రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయిమోహన్ ఉబ్బర దర్శకుడు. అహితేజ బెల్లంకొండ, అభిలాష్రెడ్డి గోడల నిర్మాతలు. ఏప్రిల్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని పాటలను మేకర్స్ విడుదల చేశారు. ‘గోదారి అటు వైపో..’ అంటూ సాగే ఈ పాటను కిట్టు విస్సా ప్రగడ రాయగా, అనుదీప్ దేవ్ స్వరపరిచి ఆలపించారు. శ్రీమాన్, దీపిక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీసాయికుమార్ దారా, సంగీతం: శరవణన్ వాసుదేవన్, అనుదీప్ దేవ్.