కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయస్సులో తిరిగిరాని లోకాలకు వెళ్లాడంటే ఎవరికి నమ్మబుద్ది కావడం లేదు. రీసెంట్గా పునీత్ రాజ్కుమార్ ద్వాదశ దినకర్మ జరగగా, దానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. బెంగళూరు కంఠీరవ స్టూడియోస్లోని పునీత్ సమాధి ఉన్న ప్రాంతంలో మంగళవారం ఆయన కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అయితే పునీత్ మృతి విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న రజనీకాంత్ ‘హూట్’ అనే వాయిస్ మెసేజ్ యాప్ ద్వారా ఆయన ఈ సందేశాన్ని వెల్లడించారు. ‘నేను ఆస్పత్రిలో ఉన్న సమయంలో పునీత్ రాజ్కుమార్ అకాల మరణం చెందారు. ఆ విషాదకర వార్త రెండు రోజుల తర్వాతే నాకు తెలియవచ్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఎంతో వేదనకు గురయ్యాను. నా కళ్లముందు పెరిగిన బిడ్డ. ప్రతి ఒక్కరిపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించే పునీత్ అలా మరణించిడం విషాదం.
స్టార్ హీరోగా శిఖరాగ్రంలో ఉన్న సమయంలో ఇంత చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. అతని మరణం భర్తీ చేయలేనిది. తమ కుటుంబీకుడిని కోల్పోయి దుఃఖంలో మునిగిపోయిన పునీత్ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు నా వద్ద మాటలు లేవు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలి. రెస్ట్ ఇన్ పీస్ మై చైల్డ్’ అంటూ రజనీకాంత్ నివాళులు అర్పించారు.