భారతీయ చిత్రసీమలో లివింగ్ లెజెండ్స్గా పేరు పొందారు అగ్ర నటులు కమల్హాసన్, రజనీకాంత్. దేశవ్యాప్తంగా వీరిద్దరికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుండగా 21 ఏండ్ల తర్వాత ఈ సూపర్స్టార్స్ ఇద్దరూ ఒకే స్టూడియోలో తమ సినిమాల షూటింగ్స్ సందర్భంగా కలుసుకోవడం విశేషం. వివరాల్లోకి వెళితే.. కమల్హాసన్ ‘ఇండియన్-2’ షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతున్నది. దీనికి సమీపంలోనే రజనీకాంత్ 170వ చిత్రం షూటింగ్ జరుగుతున్నది.
ఈ విషయం తెలుసుకున్న అగ్ర హీరోలిద్దరూ గురువారం ఉదయం షూటింగ్ లొకేషన్లో కలుసుకున్నారు. 21 సంవత్సరాల తర్వాత షూటింగ్ లొకేషన్లో వీరిద్దరు కలుసుకున్నారని, ఇదొక ప్రత్యేక సందర్భమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కమల్హాసన్, రజనీకాంత్ తమ చిత్రాల తాలూకు గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. గతంలో బాబా, పంచతంత్రం సినిమాల షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. సూపర్స్టార్స్ ఇద్దరూ కలుసుకున్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.