ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ (rajasekhar) కు పితృవియోగం కలిగింది. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ (93) (varadharajan gopal) గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వరదరాజన్ సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. వరదరాజన్కు అయిదుగురు సంతానం కాగా..రాజశేఖర్ ఆయనకు రెండో సంతానం. వరద రాజన్ చెన్నై డీసీపీగా పనిచేసి రిటైరయ్యారు. చెన్నైలో వరదరాజన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.