Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కమర్షియల్ హిట్స్కు కేరాఫ్ అడ్రస్గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab) ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనాలకి సంబంధించిన సంకేతాలు ఇస్తోంది. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీకి విదేశీ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్లు బలంగా ప్రారంభమయ్యాయి. ప్రభాస్ క్రేజ్కు మరోసారి నిదర్శనంగా, ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు 17,500కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అలాగే యూకే మార్కెట్లో కూడా 17,500కు పైగా ప్రీ-సేల్స్ నమోదు కావడం విశేషం.
2026 జనవరి 8న ప్రారంభమయ్యే ప్రీమియర్ షోలకే ఇంత భారీ స్పందన రావడం, సినిమా ఓవర్సీస్లో బలమైన ఓపెనింగ్ రాబోతుందనే సంకేతాలను ఇస్తోంది. దర్శకుడు మారుతి ఈ సినిమాను దాదాపు మూడేళ్ల పాటు శ్రమించి తెరకెక్కించినట్టు సమాచారం. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్తో పాటు ప్రభాస్ను సరికొత్తగా చూపించాలనే లక్ష్యంతో ఈ సినిమా రూపొందించబడింది. ‘బాహుబలి’, ‘సలార్’ లాంటి ఇంటెన్స్ పాత్రల తర్వాత ప్రభాస్ను లైట్ హార్ట్డ్, ఫుల్ ఎంటర్టైనర్లో చూడాలన్న అభిమానుల ఆశలను ‘ది రాజాసాబ్’ తీర్చబోతుందనే అంచనాలు ఉన్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీ.జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ది రాజాసాబ్’ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్కు ఉన్న మార్కెట్ను పూర్తిగా వినియోగించుకునేలా మేకర్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, అడ్వాన్స్ బుకింగ్లతోనే ఓవర్సీస్లో హీట్ పెంచుతున్న ‘ది రాజాసాబ్’… సంక్రాంతి రేసులో పెద్ద బ్లాక్బస్టర్గా నిలుస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ షేక్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు.