రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది. తెల్లవారితే గురువారం చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన దర్శకుడు మణికాంత్ గెల్లి తన ద్వితీయ ప్రయత్నంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బుధవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. వచ్చే నెల 6వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..‘పెళ్లి నేపథ్యంతో సాగే కథ ఇది. నవ వధూవరుల మధ్య అహం ఎలాంటి అనర్థాలు తీసుకొచ్చింది అనేది వినోదాత్మకంగా చూపిస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇంటి సెట్ వేశాం. జూలై 6 నుంచి అందులో షూటింగ్ చేయబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నారు.