Samantha | టాలీవుడ్ అగ్రనాయిక సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిస్ అనే ఆటో ఇమ్మూనిటీ డిసీజ్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన సామ్.. అందుకు అవసరమైన చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్.. సమంతకు సందేశంతో కూడిన ఓ గిఫ్ట్ ఇచ్చాడు.
‘ఇప్పుడు నీ దారి చీకటిగా ఉండొచ్చు.. కానీ త్వరలోనే అది మెరుస్తుంది. నీ శరీరంలో కదలికలు కష్టంగా ఉండొచ్చు.. కానీ త్వరలోనే అన్నీ బాగుంటాయి. ఎందుకంటే నువ్వు ఉక్కు మహిళవి. నువ్వు ఓ యోధురాలివి..’ అని రాసి ఉన్న సందేశాన్ని సమంతకు అందించాడు. ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సమంత రాహుల్కు ధన్యవాదాలు తెలిపింది. ‘కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఇది అంకితం. పోరాడుతూనే ఉండండి. అప్పుడే గతంలో కంటే బలంగా అవుతారు’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇటీవల ‘యశోద’తో ప్రేక్షకులను అలరించిన సమంత.. ప్రస్తుతం ‘శాకుంతలం’, విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ అనే ప్రేమకావ్యంలో నటిస్తోంది. వీటితోపాటు పలు బాలీవుడ్ ప్రాజెక్టులకు కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.