Radhe Shyam Director | ఒక పెద్ద హీరోతో సినిమా డిజాస్టర్ అయితే ఆ తర్వాతి ప్రాజెక్ట్ లాక్ చేసుకోవడం దర్శకులకు పెద్ద సవాలే. ఎందుకంటే ఒక స్టార్ హీరోతో సినిమా చేశాక, మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇక పెద్ద హీరోలేమో చాన్స్లు ఇవ్వరు. ప్రస్తుతం అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. ‘జిల్’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన రాధాకృష్ణ, రెండవ సినిమాకే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ‘రాధేశ్యామ్’ తీసే చాన్స్ కొట్టేశాడు. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక రాధేశ్యామ్ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఇక ఇదిలా ఉంటే రాధాకృష్ణ ఎట్టకేలకు తన మూడో సినిమాను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది.
తెలుగు మూలాలున్న కోలీవుడ్ హీరో విశాల్ తో రాధాకృష్ణ మూడో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే రాధా.. విశాల్ ను కలిసి ఓ కథను నెరేట్ చేశాడట. కథ బాగా నచ్చడంతో విశాలు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాకుండా విశాల్ తన స్వంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తమిళ మీడియాల సమాచారం. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇటీవలే లాఠితో భారీ ఫ్లాప్ మూటగట్టుకున్న విశాల్ మార్క్ ఆంటోని, డిటెక్టీవ్-2 సినిమాలు చేస్తున్నాడు. ఇక డిటెక్టీవ్ సీక్వెల్ కు స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే రాధా కృష్ణ సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉంది.