సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన మూవీ రాధేశ్యామ్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మంచి ఫీల్ గుడ్ మూవీగా చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. కరోనా వలన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని బ్రిక్స్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న రాధే శ్యామ్ చివరి దశకు చేరుకుంది.
అతి త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. మూవీ చివరలో ఓ ఎమోషనల్ సీన్ ఉంటుందట. ప్రేరణ పాత్ర పోషిస్తున్న పూజా హెగ్డే చివరలో చనిపోతుందని, ఆమె మృతితో విక్రమాదిత్య బోరున విలపిస్తాడనే టాక్ నడుస్తుంది. ఇటలీ బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ ప్రేమకథగా రానున్న ఈ మూవీలో కృష్ణం రాజు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అయనతో పాటు ప్రియదర్శి, భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, మురళి శర్మ, కునాల్ రాయ్ కపూర్, సాహా ఛేత్రి తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.