వినాయక్ దేశాయ్, అపర్ణాదేవి జంటగా నటించిన చిత్రం ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల వెంకటేష్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేమ జంట ప్రయాణానికి దృశ్యరూపంలా నిలుస్తుంది. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయి’ అన్నారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. మేక రామకృష్ణ, జయప్రకాష్, ప్రియ, నవీన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తాజ్ జీడీకే, సంగీతం: చైతు కొల్లి, కథ, మాటలు, పాటలు: వసంత్ వెంకట్ బాలా, స్క్రీన్ప్లే, దర్శకత్వం: దాసరి ఇస్సాకు.