Mardaani 3 Trailer | బాలీవుడ్ సీనియర్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మర్దానీ 3’ (Mardaani 3) ట్రైలర్ తాజాగా విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివానీ శివాజీరాయ్ పాత్రలో రాణి ముఖర్జీ మరోసారి విశ్వరూపం చూపించబోతోంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో రెండు సినిమాలు రాగా.. సూపర్ హిట్ను అందుకున్నాయి. ఇప్పుడూ తాజాగా మూడో సినిమా విడుదల కాబోతుంది.
ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. దేశంలో వేల సంఖ్యలో అదృశ్యమవుతున్న బాలికల చుట్టూ ఈ కథ తిరుగబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు భయంకరమైన ‘బెగ్గర్ మాఫియా’ ముఠాల అరాచకాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ‘అమ్మ’ అనే క్రూరమైన మహిళను పట్టుకోవడానికి శివానీ చేసే పోరాటం ఏంటి అనేది ఈ సినిమా కథ.
బాలీవుడ్లో రాణి ముఖర్జీ ప్రస్థానం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను ఒక మైల్స్టోన్గా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. అభిరాజ్ మినావాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. రాణి ముఖర్జీతో పాటు ‘శైతాన్’ ఫేమ్ జానకి బొడివాలా కీలక పాత్రలో కనిపిస్తుండగా, మల్లికా ప్రసాద్ విలన్గా మెప్పించనుంది. ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.