Raajadhani Files | టాలీవుడ్లో ఈ మధ్య ఏపీ రాజకీయాలకు సంబంధించి సినిమాలు రావడం కామన్ అయిపోయింది. ఇప్పటికే సంచలన దర్శకుడు ఆర్జీవీ వ్యూహం అంటూ రానుండగా.. మరోవైపు ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా యాత్ర-2 రాబోతుంది. అయితే ఇవి సరిపోవు అన్నట్టు తాజాగా అమరావతి రైతుల ఉద్యమం నేపథ్యంలో ‘రాజధాని ఫైల్స్’ అనే చిత్రం రాబోతుంది. అఖిలన్, వీణ ప్రధాన పాత్రధారులుగా వస్తున్న ఈ సినిమాను భాను దర్శకత్వం వహిస్తుండగా.. కంఠంనేని రవిశంకర్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. అరుణప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదన నేపథ్యంలో ‘రాజధాని ఫైల్స్’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. శ్రీమతి బిందు సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో వినోద్కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, మధు, అజయ్రత్నం, అంకిత ఠాకూర్, అమృత చౌదరి తదితరులు నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.