Pushpa The Rise | 2021 చివర్లో విడుదలై దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘పుష్ప ది రైస్’. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా ‘పుష్ప ది రూల్ చిత్రం రానుంది. మాస్ యాక్షన్ థ్రిల్లర్గా రానున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ సెకండ్ పార్ట్ను 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ‘పుష్ప’ సినిమా వాయిదా పడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ.. ‘పుష్ప యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చింది.
ఈ సినిమాను ముందు చెప్పినట్లుగానే ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్ క్లారిటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు పుష్ప 2 రిలీజ్ రోజే బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ నటిస్తున్న సింగం అగైన్ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక పుష్ప ది రూల్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్(Pushpa 2 OTT Rights) సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
𝟏𝟓 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝟎𝟐𝟒 💥 #Pushpa2TheRule https://t.co/pUfgqlTvpZ pic.twitter.com/r7V3oLdXto
— Pushpa (@PushpaMovie) January 26, 2024