Puri Jagannadh | టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), ఛార్మీ కలిసి పూరీ కనెక్ట్స్ (Puri connects)బ్యానర్పై సినిమాలను నిర్మిస్తున్నారని తెలిసిందే. అయితే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా వ్యవహరించిన లైగర్ బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. భారీగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు పూరీ. ఇదిలా ఉంటే పూరీ-ఛార్మీ (Puri And Charmme) బిజినెస్ ప్లాన్కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni )తో సీక్వెల్ చేస్తున్నట్టు ప్రకటించాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
పోకిరి, టెంపర్ మేకర్స్ ఈ సినిమాను చేసేందుకు ముందుకు వచ్చారట. మరోవైపు మెగాస్టార్ హోం బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ కూడా రామ్ సినిమా కోసం పూరీకి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. అయితే పూరీ-ఛార్మీ వారి ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. సినిమాను డైరెక్ట్ చేసి రెమ్యునరేషన్ తీసుకోవడం కంటే సొంతంగానే ఈ సినిమాను నిర్మించాలని ఫిక్సయ్యారట. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఇలాంటి పరిస్థితుల్లో పూరీ-ఛార్మీ టీం పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా లెక్కచేయకుండా సొంతంగానే బిజినెస్ ప్లాన్ చేయాలనుకోవడం హైలెట్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నిర్మాతలు పూరీ జగన్నాథ్కు రూ.20 కోట్లు-30 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశాలున్నాయట. ఒకవేళ పూరీనే స్వయంగా సినిమాను నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద సినిమా ఫ్లాప్ అయినా పెట్టిన డబ్బులు సులభంగా రికవరీ (రెట్టింపు) అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అందువల్లే ఇతరుల కోసం సినిమాలు డైరెక్ట్ చేయకుండా.. హోం బ్యానర్లోనే సినిమాలు చేయాలనుకుంటున్నాడట పూరీ జగన్నాథ్. మొత్తానికి ఈ సారి పూరీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్తో ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు ఆయన కాన్ఫిడెన్స్ చూసిన సినీ జనాలు.