త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ్ జాధవ్, ముక్కు అవినాష్ ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘పంచనామా’. సిగటాపు రమేష్ నాయుడు దర్శకుడు. గద్దె శివకృష్ణ, వెలగరాము నిర్మాతలు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ను ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో నేటి ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలున్నాయి. తప్పకుండా ఈ చిత్రం దర్శకుడిగా నాకు మంచి గుర్తింపును తీసుకువస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఆలపాటి లక్ష్మి, ఆంజనేయులు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్:బసవ రెడ్డి, సంగీతం: ప్రదీప్ చంద్ర.