దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్-కె’ నుంచి కథానాయిక దీపికా పడుకోన్ ఫస్ట్లుక్ను సోమవారం విడుదల చేశారు. ఇందులో ఆమె తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నది. ఆమె కళ్లు ఏదో నిగూఢమైన రహస్యాన్ని శోధిస్తున్నట్లుగా ఉన్నాయి. ‘రేపటి కొత్త ప్రపంచం తాలూకు ఆశలను ఆమె కళ్లు ప్రతిఫలిస్తున్నాయి’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఫస్ట్లుక్ పోస్టర్కు క్యాప్షన్ను జత చేసింది.
ఈ పోస్టర్కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తున్నది. ప్రభాస్ కథానాయకుడి నాగ్అశ్విన్ దర్శకత్వంలో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. సూపర్హీరో కథాంశంతో భారతీయ సినిమాలో మునుపెన్నడూ చూడనటువంటి విజువల్ ఎఫెక్ట్స్తో ఈ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు. అమెరికా శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ‘ప్రాజెక్ట్-కె’ ఫస్ట్లుక్ను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో అమితాబ్బచ్చన్, కమల్హాసన్ వంటి దిగ్గజ నటులు భాగం కావడం ప్రేక్షకులను ఆకర్షిస్తున్నది.