తెలుగు సినీ నిర్మాత మహేష్ కోనేరు మంగళవారం ఉదయం విశాఖపట్నంలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సినీ పాత్రికేయుడిగా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం నిర్మాతగా మారారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా 118, నా నువ్వే, మిస్ ఇండియా, తిమ్మరుసు చిత్రాల్ని నిర్మించారు. విజయ్ హీరోగా నటించిన బిగిల్, మాస్టర్ చిత్రాలను తెలుగులోకి అనువదించారు. మహేష్ కోనేరు నిర్మిస్తున్న సభకు నమస్కారం, పోలీసు వారి హెచ్చరికతో పాటు సందీప్కిషన్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అగ్రహీరోలు ఎన్టీఆర్, కల్యాణ్రామ్లకు వ్యక్తిగత పీఆర్వోగా మహేష్ కోనేరు పనిచేశారు. ‘నా ప్రియమిత్రుడు మహేష్ కోనేరు మరణంతో హృదయం భారంగా మారింది. షాక్కు లోనయ్యాను. మాటలు రావడం లేదు’ అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా మహేష్ కోనేరు మృతికి సంతాపం తెలిపారు. నా స్నేహితుడు, కుటుంబసభ్యుడు, ఆత్మీయుడైన మహేష్ కోనేరు మరణించారంటే నమ్మలేకపోతున్నానని కల్యాణ్రామ్ పేర్కొన్నారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్తో పాటు పలువురు సినీ ప్రముఖులు మహేష్ కోనేరుకు నివాళులు అర్పించారు.