ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది మార్చ్లో విడుదలైన ‘రాధేశ్యామ్’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ‘సాహో’ తర్వాత దాదాపు నాలుగేళ్ళకు డార్లింగ్ను వెండితెరపై చూడబోతున్నామని ఆశతో వచ్చిన అభిమానులను ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా భారీ ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్పై ఉంచాడు. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతుంది. తాజాగా ఈ సినిమాపై నిర్మాత అశ్వినీదత్ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
తాజాగా జరిగిన ఇంటర్వూలో అశ్వినీదత్ మాట్లాడుతూ ప్రాజెక్ట్-కే సినిమా అందరిని ఆశ్చర్య పరిచే విధంగా అవేంజర్స్ తరహాలో ఉంటుందిని తెలిపాడు. చైనా-అమెరికా ఇతర అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 2023 లేదా జనవరి 2024లో చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. సై-ఫై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.